Telangana Rajiv Yuva Vikasam 2025 Applications Started : రాజీవ్ యువ వికాసం పథకంను మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.


రాజీవ్ యువ వికాసం పథకం పూర్తి వివరాలు

తెలంగాణలోని యువత కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. సుమారు రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ పథకాన్ని మార్చి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద.. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుండగా.. ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అయితే.. ఈ లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఏఏ డాక్యుమెంట్లు అవసరం అనేది తెలుసుకోండి.

తెలంగాణ యువత కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.6 వేల కోట్లతో ప్రారంభించిన ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన యువకులకు రూ.4 లక్షల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. లోన్ మొత్తాన్ని బట్టి 60 నుంచి 80 శాతం వరకు ప్రభుత్వమే సబ్సిడీ వస్తుంది. ఈ పథకం ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. అయితే.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏఏ డాక్యుమెంట్లు కావాలో..? తెలుసుకుందాం..



  • మీ దరఖాస్తుకు సంబంధించిన సమాచారం కోసం జిల్లా బీసీ వెల్‌ఫేర్ అధికారికి ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. హెల్ప్‌లైన్ నెంబర్ 040-12345678కి ఫోన్ చేయవచ్చు.

దరఖాస్తు కోసం ఏఏ డాక్యుమెంట్లు కావాలి..

  • ఆధార్ కార్డు
  • తెలంగాణ డొమిసిల్ సర్టిఫికేట్
  • క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్
  • బ్యాంకు అకౌంట్ వివరాలు
  • రేషన్ కార్డు
  • ఎంప్లమ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ రిజిస్ట్రేషన్

ఎంత లోన్‌‌కు ఎంత సబ్సీడీ వస్తుందంటే..?

రాజీవ్ యువ వికాసం పథకం కింద లోన్ తీసుకున్న వారికి ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. లబ్ధిదారుడు తీసుకున్న లోన్ మొత్తాన్ని బట్టి ఎంత సబ్సీడీ ఇవ్వాలనేది నిర్ధారిస్తారు. అయితే.. 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సీడీ వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష రూపాయల లోపే తీసుకుంటే.. 80 శాతం సబ్సీడీ వచ్చే ఛాన్స్ ఉంది. 80 శాతం పోగా మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు కట్టాల్సి ఉంటుంది. లక్ష నుంచి 2 లక్షల వరకు లోన్ తీసుకుంటే.. 70 శాతం సబ్సీడీ రాగా.. మిగిలిన 30 శాతం కట్టాల్సి ఉంటుంది. 4 లక్షల వరకు లోన్ తీసుకుంటే మాత్రం 60 శాతం సబ్సీడీ వస్తుంది. ఇక మిగిలిన 40 శాతం మొత్తాన్ని లబ్దిదారులే కట్టాల్సి ఉంటుంది. ఇంకేందుకు ఆలస్యం.. ప్రభుత్వం ఇస్తున్న ఈ సూపర్ ఛాన్స్‌ని అందిపుచ్చుకుని.. జీవితంలో ఒక సువర్ణాధ్యాయాన్ని మొదలుపెట్టేయండి..!


Rajiv Yuva Vikasam Scheme Application Link 2025 : యువ వికాసం పథకానికి దరఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్ లింక్ ఇదే..

సక్తి కలిగిన నిరుద్యోగ యువత... రాజీవ్ యువ వికాసం పథకంను https://tgobmms.cgg.gov.in/ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పథకం కింద దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్లతో సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయనుంది.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ తెలిపింది. అర్హులకు కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ పోను, మిగతా 20 శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడమో ఉంటుంది. కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు.

ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. అర్హులను ఎంపిక చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అయిన జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ పథకం కింద ఒక్కొక్కరు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్‌సైట్‌లో ఇప్పటికే వెల్లడించారు.

CM Revanth Reddy : అర్హులకే రూ.4 లక్షలు.. ఎవరికి ఇస్తామో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి!


CM Revanth Reddy : అర్హులకే రూ.4 లక్షలు.. ఎవరికి ఇస్తామో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి!

CM Revanth Reddy : రాజీవ్‌ యువ వికాసం పథకం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం.

ఈ పథకం కింద అర్హులైన యువతకు మాత్రమే లబ్ధి చేకూరేలా రూపొందించబడింది. అర్హత ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అర్హత ప్రమాణాలు:
నివాసం: దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి.
వయస్సు: యువత (సాధారణంగా 21-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు) ఈ పథకానికి అర్హులు. ఖచ్చితమైన వయస్సు పరిమితి అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొనబడుతుంది.
విద్యార్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత లేదా అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి (పథకం రకం ఆధారంగా మారవచ్చు).
నిరుద్యోగం: దరఖాస్తుదారుడు ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండి, స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశ్యంతో ఉండాలి.
కమ్యూనిటీ: ఈ పథకం ప్రధానంగా SC(షెడ్యూల్డ్‌ కులాలు), ST(షెడ్యూల్డ్‌ తెగలు), BC(బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌), మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన యువత కోసం రూపొందించబడింది.
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం పథకం నిబంధనల ప్రకారం నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉండాలి (ఖచ్చితమైన వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి).

ఇతర షరతులు..
దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాల ద్వారా లబ్ధి పొందకూడదు.

పథకం వివరాలు:
ఆర్థిక సహాయం: అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇందులో సబ్సిడీ (60%-80% వరకు), లోన్‌ రూపంలో సహాయం ఉంటుంది.

మొత్తం బడ్జెట్‌: ఈ పథకం కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించబడ్డాయి. 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా సహాయం అందనుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. అధికారిక వెబ్‌సైట్‌ (tgobmms.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లు:
ఆధార్‌ కార్డు
రేషన్‌ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం
ఆదాయ ధ్రువీకరణ పత్రం
విద్యార్హత సర్టిఫికెట్లు
పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో
మొబైల్‌ నంబర్‌
బ్యాంక్‌ ఖాతా వివరాలు

ఎంపిక విధానం:
దరఖాస్తుల స్క్రీనింగ్‌ ఏప్రిల్‌ 6 నుంచి మే 31, 2025 వరకు జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత కార్పొరేషన్‌ అధికారులు అర్హతను పరిశీలించి, ఎంపికైన వారికి జూన్‌ 2, 2025 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాడు సాంక్షన్‌ లెటర్లు అందజేయబడతాయి.

అర్హులకే సాయం..
ఈ పథకం అర్హులైన యువతకు మాత్రమే లభిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు అంతస్తుల భవనాల్లో ఉంటూ తనకు ఉద్యోగం లేదంటే కుదరదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Telangana Rajiv Yuva Vikasam 2025 Applications Started : Check Direct Link Here!

BK Technologies, H No 7-3-C-97, 

Near Lord Sri Venkateshwara Swami 

TemplePanagal, Nalgonda Dist, 

Pincode 508001, Telangana

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.